బుద్ధవచనం పత్రిక తరపున మీకు మైత్రిపూర్వక స్వాగతం. ఇరవైఐదు శతాబ్దాలకు పూర్వం, గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించాడని చెప్పడే ప్రవచనాలను తేటతెలుగులో సంగ్రహంగా అందించటం, బుద్ధుని ధర్మాన్ని సహేతుకంగా, సరళంగా, ఆచరణాత్మకంగా విశ్లేషించే రచనలను పాఠకులకు అందించటం, ఈ అతర్జాల పత్రిక ప్రధాన ఉద్దేశం. దీనితోపాటు, పాఠకులు తమ అభిప్రాయాలను, విమర్శలను, సూచనలను పత్రికలో నేరుగా రాయటానికి, వాటిపై చర్చించటానికి తగిన సదుపాయం దీనిలో కల్పించబడింది.

ఈ పత్రిక అంతర్జాలంలో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనిని కంప్యూటర్ లేదా స్మార్ట్-ఫోనులో పరికించవచ్చు. పత్రికను ఫలవంతంగా నడపటానికి సంపాదకులతో పాటు, రచయితలు, పాఠకులు కూడా చురుకైన పాత్ర పోషించటం అవసరం. కనుక, బుద్ధవచనం పత్రికను అర్థవంతంగా సుసంపన్నంగా తీర్చిదిద్దేటందుకు రచయితలు, పాఠకులు తమవంతు బాధ్యతను నిర్వహించటానికి ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

అభివందనలతో … సంపాదకులు

 

⇐శీర్షికలు